ఇంగ్లాండ్ 'కల' నెరవేరి నేటికీ సరిగ్గా ఏడాది ...
By: Sankar Tue, 14 July 2020 12:48 PM
ఇప్పటిదాకా క్రికెట్ లో చాల ప్రపంచ కప్ లు జరిగాయి అయితే గత ఏడాది ఇంగ్లాండ్ , న్యూజీలాండ్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లాగ ఏ మ్యాచ్ జరిగి ఉండదు ..ఎన్నో అనూహ్య మలుపులు తిరుగుతూ ,మైదానంలో , టీవీలలో చూస్తున్న ప్రేక్షకులను మునివేల్ల మీద నిలబెట్టిన ఈ మ్యాచ్ లో రెండు సార్లు టై అయింది ..దీనితో తొలిసారిగా ఒక ప్రపంచ విజేతను బౌండరీల కౌంట్ ఆధారంగా నిర్ణయించారు ..దీనితో ఆ మ్యాచ్ లో న్యూజీలాండ్ కంటే అత్యధిక బౌండరీలు బాదిన ఇంగ్లాండ్ జట్టు తొలిసారి జగజ్జేతగా నిలిచింది ..దీనితో క్రికెట్ పుట్టినిల్లు అయినప్పటికీ ఒక్కసారి కూడా ప్రపంచకప్ గెలవలేదు అన్న అపఖ్యాతిని తొలగించుకుంది ..మరోవైపు వరుసగా రెండో సారి ఫైనల్లో ఓడిపోయి న్యూజిలాండ్ నిరాశతో వెనుదిరిగింది ..
వన్డేల హిస్టరీలోనే ఓ మైలురాయిగా నిలిచిన ఈ ఫైనల్కు నేటితో(జులై 14) ఓ ఏడాది నిండింది. ఈ చారిత్రాక మ్యాచ్ ఇంగ్లండ్ జట్టు బౌండరీ ఆధారంగా న్యూజిలాండ్పై నెగ్గి జగజ్జేతగా అవతరించింది. ఛేజింగ్లో ఇంగ్లండ్ బ్యాట్స్మన్ బెన్ స్టోక్స్ పోరాటంతో ఆఖరి ఓవర్లో ఆ జట్టు 15 పరుగులు చేయాల్సివుంది. అంతకుముందు డీప్ వద్ద స్టోక్స్ ఇచ్చిన క్యాచ్ను ట్రెంట్ బౌల్ట్ జారవిడిచాడు.
ఆఖరి ఓవర్లో బంతిని అందుకున్న బౌల్ట్ తొలి రెండు డెలివరీలను డాట్స్గా మలిచాడు. స్టైక్లో ఉన్న స్టోక్స్ మూడో బంతిని సిక్సర్గా మలిచి ఇంగ్లండ్ శిబిరంలో ఆనందం నింపాడు. ఆ తర్వాతి బంతిని ఆడిన స్టోక్స్ పరుగు కోసం డైవ్ చేశాడు. ఫీల్డర్ గప్టిల్ శరవేగంగా బంతిని త్రో చేశాడు. అది స్టోక్స్ బ్యాట్ను బలంగా తాకి బౌండరీ దాటింది. దీంతో న్యూజిలాండ్ జట్టు నివ్వెరపోయింది. ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాలి. ఇంగ్లండ్ బ్యాట్స్మన్ మార్క్ వుడ్ రనౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ టై అయింది.
సూపర్ ఓవర్లో స్టోక్స్, జోస్ బట్లర్ కలిసి న్యూజిలాండ్కు 16 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.న్యూజిలాండ్ బ్యాట్స్మన్ జేమ్స్ నీషమ్ ఓ సిక్సర్ బాదాడు. చివరి బంతికి రెండు పరుగులు చేస్తే న్యూజిలాండ్ విశ్వవిజేతగా నిలుస్తుంది. రెండు పరుగుల కోసం ఊపిరి బిగబట్టి చేసిన ప్రయత్నంలో గప్టిల్ రనౌట్ అయ్యాడు. దాంతో న్యూజిలాంట్ టీమ్ నిరాశలో కూరుకుపోయింది.ఇంగ్లండ్ క్రీడాకారుల విజయనాథంతో లార్డ్స్ క్రికెట్ స్టేడియం ఉర్రూతలూగింది. ఈ మ్యాచ్లో బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్(26), న్యూజిలాండ్(17)పై గెలుపొందింది.