సంచలన విజయం సాధించిన వెస్ట్ ఇండీస్ ..కరోనా విరామం తర్వాత క్రికెట్ కు ఘనమైన ఆరంభం ..
By: Sankar Mon, 13 July 2020 10:52 AM
దాదాపు మూడు నెలల తర్వాత ప్రారంభమైన క్రికెట్ కు తొలి రోజు వరుణుడు అడ్డుగా వచ్చినప్పటికీ ఆ తర్వాత శాంతించడంతో ఇంగ్లాండ్ వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులు ఫలితం తేలింది ..అయితే అనూహ్యంగా ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు , పర్యాటక వెస్ట్ ఇండీస్ చేతిలో ఓటమిపాలు అయింది ...
సొంత గడ్డ మీద మహా మహా దిగ్గజ జట్లనే ఓడించే ఇంగ్లాండ్ ఆశ్చర్యకరంగా తన కంటే తక్కువ బలమైన జట్టు అయినా వెస్ట్ ఇండీస్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది ..తొలి ఇన్నింగ్స్ లో విఫలమైనా రెండో ఇన్నింగ్స్లో పట్టుదలతో ఆడిన బ్లాక్ వుడ్ వెస్ట్ ఇండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు ..అయితే రెండు ఇన్నింగ్సలలో అద్భుత బౌలింగ్ తో ఇంగ్లాండ్ భారతం పట్టిన గాబ్రియల్ మాన్ అఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు ..
రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు 200 పరుగుల లక్ష్యాన్ని వెస్ట్ ఇండీస్ ముందు ఉంచింది ..అయితే ఇంగ్లండ్లో నాలుగో ఇన్నింగ్స్లో 200 పరుగులు చేస్ చేయడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు .. అందుకు తగ్గట్లు గానే ఛేదన ఆరంభంలోనే ఓపెనర్లు క్రైగ్ బ్రాత్వైట్ (4), షై హోప్ (9), బ్రూక్స్ (0) వరుసగా నిరాశపరిచినా.. రోస్టన్ ఛేజ్ (37: 88 బంతుల్లో 1x4), డార్విచ్ (20: 37 బంతుల్లో 1x4)తో కలిసి అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన బ్లాక్వుడ్ కరీబియన్లకి 6 వికెట్ల తేడాతో చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. 2000 తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై వెస్టిండీస్ జట్టు ఓ టెస్టు మ్యాచ్లో గెలుపొందడం ఇది రెండోసారి మాత్రమే. మూడు టెస్టుల ఈ సిరీస్లో.. గురువారం నుంచి మాంచెస్టర్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది..