Advertisement

  • ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా సిరీస్ ను వెంటాడుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా సిరీస్ ను వెంటాడుతున్న కరోనా పాజిటివ్ కేసులు

By: Sankar Mon, 07 Dec 2020 5:57 PM

ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా సిరీస్ ను వెంటాడుతున్న కరోనా పాజిటివ్ కేసులు


ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్ర స్థాయిలోనే ఉన్నప్పటికీ అనేక జాగ్రత్తలు తీసుకుంటూ క్రికెట్ మ్యాచ్ లను నిర్వహిస్తున్నారు ..అయితే ఇంగ్లాండ్ , సౌత్ ఆఫ్రికా సిరీస్ ను మాత్రం కరోనా వెంటాడుతూనే ఉంది ..దీనితో వరుసగా రెండు వన్ డేలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి...

ఇంగ్లండ్ టీమ్‌లో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్‌గా తేలింద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో వ‌న్డే మ్యాచ్‌ను వాయిదా వేసిన‌ట్లు క్రికెట్ సౌతాఫ్రికా ప్ర‌క‌టించింది. సోమ‌వారం జ‌ర‌గాల్సిన ఈ మ్యాచ్‌ను మంగ‌ళ‌వారానికి వాయిదా వేశారు. బుధ‌వారం మూడో వ‌న్డే జ‌ర‌గాల్సి ఉంది. గురువారం రోజు ఇంగ్లండ్ టీమ్ సౌతాఫ్రికా నుంచి స్వ‌దేశానికి బ‌య‌లుదేర‌నుంది. అయితే ప్ర‌స్తుతం ప‌రిస్థితి చూస్తుంటే.. ఈ రెండు వ‌న్డేలు కూడా అస‌లు జ‌రుగుతాయా అన్న అనుమానం క‌లుగుతోంది.

ప్లేయ‌ర్స్‌కు జ‌రిపిన టెస్టుల ఫ‌లితాల‌పై రెండు టీమ్స్ చ‌ర్చించిన త‌ర్వాత ఈ రెండు వ‌న్డేల విష‌యంలో తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని క్రికెట్ సౌతాఫ్రికా స్ప‌ష్టం చేసింది. అక్క‌డి మీడియా వార్త‌ల ప్ర‌కారం.. పాజిటివ్‌గా తేలిన ఇద్ద‌రు ఇంగ్లండ్ క్రికెట‌ర్ల‌కు మ‌రిన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.

Tags :
|
|

Advertisement