కేయూ యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ తరగతులు డిసెంబర్ 7 నుంచి ప్రారంభం....
By: Sankar Mon, 30 Nov 2020 6:46 PM
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగానే గాక ప్రపంచ వ్యాప్తంగా కూడా కాలేజీలు మూత పడ్డాయి ..అయితే దేశంలో కరోనా తగ్గుతుండటంతో పాఠశాలలు , కాలేజీలు తిరిగి ఓపెన్ అయితున్నాయి...
కాకతీయ యూనివర్సిటీ పరధిలోని ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సర తరగతులు డిసెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆ డిపార్ట్మెంట్ డీన్ ప్రొఫెసర్ తాడిశెట్టి శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విశ్వవిద్యాలయ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశంలో తరగతుల షెడ్యూల్ను నిర్ణయించారు. కార్యక్రమంలో కేయూ క్యాంపస్, కొత్తగూడెం ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్ మల్లారెడ్డి, డాక్టర్ రమణ, వినూత్న కాలేజీ, చైతన్య కాలేజీ, విట్స్ కాలేజీ ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
Tags :
1st year |
classes |