Advertisement

  • జిహెచ్ఎంసి ఎన్నికల కోసం ఆంధ్ర నుంచి రిటర్న్ వస్తున్న బ్యాలెట్ బాక్సులు

జిహెచ్ఎంసి ఎన్నికల కోసం ఆంధ్ర నుంచి రిటర్న్ వస్తున్న బ్యాలెట్ బాక్సులు

By: Sankar Thu, 08 Oct 2020 10:49 PM

జిహెచ్ఎంసి ఎన్నికల కోసం ఆంధ్ర నుంచి రిటర్న్ వస్తున్న  బ్యాలెట్ బాక్సులు

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. పోలింగ్‌ను బ్యాలెట్ ద్వారా నిర్వహించాల‌ని రాష్ట్ర ఎల‌క్షన్ క‌మిష‌న్ నిర్ణయించింది.

అయితే, ఎన్నికలకు 30 వేల బ్యాలెట్ బాక్సులు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని అధికారులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌కు తెలంగాణ‌ జిల్లాల నుంచి దాదాపు 30 వేల బ్యాలెట్ బాక్సుల‌ను ఆ రాష్ట్రానికి పంపారు. అయితే అక్కడ ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌డంతో జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌ కోసం వాటిని మళ్లీ ఇటు తెప్పిస్తున్నారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ అడిషనల్ క‌మిష‌న‌ర్ యాద‌గిరిరావు గురువారం వెల్లడించారు.

గురువారం నాటికి 17,366 బ్యాలెట్ బాక్స్‌లు ఆంధ్రప్రదేశ్‌లోని 7 జిల్లాల నుంచి అందిన‌ట్లు తెలిపారు. మిగిలిన 12,366 బ్యాలెట్ బాక్సుల‌ను కూడా ఏపీలోని వివిధ జిల్లాల నుంచి తెప్పించే పనిలో ఉన్నట్లు వివరించారు. ఏపీ నుంచి వస్తున్న బ్యాలెట్ బాక్సులన్నింటినీ చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్‌లో భద్రపరుస్తున్నారు. నాలుగైదు రోజుల్లో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు అన్ని బ్యాలెట్ బాక్సులు నగరానికి చేరుకుంటాయని అన్నారు.

Tags :
|

Advertisement