Advertisement

  • యూకే నుంచి కేరళ వచ్చినవారిలో 8 మందికి కరోనా పాజిటివ్

యూకే నుంచి కేరళ వచ్చినవారిలో 8 మందికి కరోనా పాజిటివ్

By: Sankar Sat, 26 Dec 2020 3:02 PM

యూకే నుంచి కేరళ వచ్చినవారిలో 8 మందికి కరోనా పాజిటివ్


యూకేను ప్రస్తుతం కొత్త కరోనా స్ట్రెయిన్ ఇబ్బందులు పెడుతున్నది. లండన్ తో పాటుగా బ్రిటన్ లోని అనేక ప్రాంతాలకు ఈ వైరస్ వేగంగా విస్తరించడంతో అప్రమత్తమయ్యి లాక్ డౌన్ విధించింది. కరోనా కొత్త స్ట్రెయిన్ ను గుర్తించే సరికి ఆ వైరస్ అనేక ప్రాంతాలకు వ్యాపించింది.

యూకే నుంచి వచ్చే విమానాలపై తాత్కాలిక నిషేధం విధించింది. డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. అయితే, డిసెంబర్ 23 వ తేదీ వరకు యూకే నుంచి వచ్చిన వ్యక్తులను ట్రేస్ చేసి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

యూకే నుంచి కేరళ వచ్చిన వ్యక్తులకు అక్కడి ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో 8 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. రాష్ట్రంలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలపై దృష్టి సారించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Tags :
|
|

Advertisement