తూర్పు గోదావరి, కర్నూలు ఈ రెండు జిల్లాల్లో కలిపి లక్షకు పైగా కరోనా కేసులు
By: chandrasekar Thu, 03 Sept 2020 5:10 PM
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు రోజూ 10
వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా మరణాలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్లో గడిచిన 24 గంటల్లో
60,804 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా
10,392 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 4,55,531కు పెరిగాయి. అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు స్వల్పంగా తగ్గాయి. బుధవారం ఒక్కరోజే కరోనా మహమ్మారి బారినపడి 72 మంది మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య
4,125కు చేరింది.
అలాగే కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో నెల్లూరు జిల్లాలో 11
మంది, చిత్తూరులో 10
మంది, పశ్చిమ గోదావరిలో 9 మంది, ప్రకాశంలో 8 మంది, కృష్ణా జిల్లా ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, అనంతపురంలో నలుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విజయనగరంలో ముగ్గురు, కపడలో ఇద్దరు, కర్నూలులో ఒకరు మృతి చెందారు. అలాగే బుధవారం
8,454 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం
4,55,531 పాజిటివ్ కేసులకు గాను,
3,48,330 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 1,03,076 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి చెలరేగిపోతోంది. ఈ ఒక్క జిల్లాలోనే 60
వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారంతో కలిపి తూర్పు గోదావరిలో ఇప్పటి వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా 61,810 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే కర్నూలులో సైతం కరోనా తీవ్రంగా పెరుగుతోంది. కర్నూలు జిల్లాలో
46,255 కేసులు నమోదయ్యాయి. దీంతో తూర్పు గోదావరి, కర్నూలు ఈ రెండు జిల్లాల్లో కలిపి లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి.