Advertisement

  • హైదరాబాద్ నగరంలోని వనస్థలీపురంలో భూ ప్రకంపనలు

హైదరాబాద్ నగరంలోని వనస్థలీపురంలో భూ ప్రకంపనలు

By: chandrasekar Thu, 22 Oct 2020 6:14 PM

హైదరాబాద్ నగరంలోని వనస్థలీపురంలో భూ ప్రకంపనలు


గురువారం వేకువ జామున హైదరాబాద్ నగరంలోని వస్థలీపురం బీఎన్‌రెడ్డి నగర్‌లో భూ ప్రకంపనలు వచ్చాయి. తెల్లవారు జామున 5.40 గంటల సమయంలో సెకను పాటు భూమి కంపించింది. శబ్దాలు రావడంతో ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు పెట్టారు.

మూడుసార్లు స్వల్పంగా ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెప్పారు. భూ ప్రకంపనలు అధికారులు ధ్రువీకరించలేదు. ఇదిలా ఉండగా ఈ వారం రోజుల కిందట గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ప్రాంతాల్లో స్వల్ప౦గా భూప్రకంపనలు వచ్చాయి.

మై హోం విహంగ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, టీఎన్జీవో 2 కాలనీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. భూమి లోపలి నుంచి శబ్దాలు కూడా వచ్చాయని భయం వ్యక్తం చేశారు. గచ్చిబౌలిలో వచ్చిన భూప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 0.5 నుంచి 0.8 మధ్య ఉండొచ్చని నిపుణులు అంచనా వేశారు.

Tags :
|

Advertisement