ఢిల్లీలో సమీపంలోని నోయిడా ప్రాంతంలో భూప్రకంపనలు
By: chandrasekar Fri, 05 June 2020 7:21 PM
ఢిల్లీలో మరోసారి భూమి
కంపించింది. గత నెల రోజులుగా ఢిల్లీలో భూప్రకంపనలు ప్రజలను భయాందోళనలకు గురి
చేస్తున్నాయి.ఇప్పటికే ఓవైపు కరోనా వైరస్తో అతాలకుతలం అవుతున్న ప్రజలకు ఈ
భూప్రకంపనలు నిద్ర లేకుండా చేస్తున్నాయి.
ఢిల్లీ సమీపంలోని నోయిడా
ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో ఈ భూప్రకంపనలు సంభవించాయని అధికారులు
చెబుతున్నారు. నోయిడాలో దక్షిణ తూర్పున 19
కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
దీని తీవ్రత రిక్టర్
స్కేలుపై 3.2గా
నమోదైంది. నోయిడాలో 3.8
కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా, గత నెల రోజులుగా భూప్రకంపనలు ప్రజలకు కంటిమీద కునుకు
లేకుండా చేస్తున్నాయి.. గత నెల రోజులుగా పలుమార్లు స్వల్ప భూ ప్రకంపనలు
సంభవించాయి. ఈ భూప్రకంపనలు ఇంకా ఎన్ని రోజులుంటాయోనని ఆందోళన వ్యక్తం
చేస్తున్నారు.