పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో భూప్రకంపనలు
By: chandrasekar Fri, 25 Sept 2020 11:52 AM
పాకిస్థాన్ రాజధాని
ఇస్లామాబాద్లో ఈ ఉదయం స్వల్ప భూప్రకంపనలు ఏర్పడ్డాయి.
భూప్రకపంనల తీవ్రత
రిక్టర్ స్కేల్పై 4.3గా నమోదైందని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్సీఎస్)
పేర్కొంది.
ఇస్లామాబాద్ నగరానికి
పశ్చిమంగా 40 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్లు ఎన్సీఎస్
తెలిపింది.
ఒక్కసారిగా ప్రకంనలు చోటు
చేసుకోవడంతో జనాలు భయాందోళనకు గురై ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.
Tags :
capital |