Advertisement

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ జిల్లాలో భూకంపం

By: chandrasekar Wed, 30 Sept 2020 5:52 PM

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ జిల్లాలో భూకంపం


మంగళవారం మధ్యాహ్నం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ జిల్లాలో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సిస్మోలాజికల్‌ రీసెర్చ్‌ (ఐఎస్‌ఆర్‌) పేర్కొంది.

ఐఎస్‌ఆర్‌ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 3.39 గంటలకు ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రం జిల్లాలోని ఉప్లెటా పట్టణం నుంచి తూర్పు ఈశాన్య దిశలో, భూమి లోపల 14.5 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు తెలిపింది.

ప్రకంపనలతో ఈ ప్రాంతంలో ఏ పోలీస్‌స్టేషన్‌కు ప్రాణ, ఆస్తి నష్టంపై ఎలాంటి నివేదికలు, ఫిర్యాదులు అందలేదని రాజ్‌కోట్‌ గ్రామీణ పోలీస్‌ అధికారి ఒకరు చెప్పారు.

Tags :

Advertisement