Advertisement

  • తెలంగాణలో డిజిటల్ తరగతులు, ఎంసెట్ నిర్వహణకు సన్నాహాలు

తెలంగాణలో డిజిటల్ తరగతులు, ఎంసెట్ నిర్వహణకు సన్నాహాలు

By: Dimple Tue, 11 Aug 2020 01:05 AM

తెలంగాణలో డిజిటల్ తరగతులు, ఎంసెట్ నిర్వహణకు సన్నాహాలు

తెలంగాణలో విద్యార్థులు సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి.ఇంజినీరింగ్ కోర్సుల్లో చేర్చుకున్న ఇంటర్ విద్యార్థులకు ఎంసెట్ నిర్వహణపై సముచిత నిర్ణయం తీసుకున్నారు.ఈ నెల 20 నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు ప్రారంభమవుతాయని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు దూరదర్శన్‌, టీశాట్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తామన్నారు. సోమవారం ఆమె విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రవేశ పరీక్షలు, పరీక్షలు, విద్యా సంవత్సరంపై కీలకంగా సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 1 నుంచి 3-5 తరగతుల విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు ఉంటాయన్నారు. ఈ నెల 17 నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్‌ 1 తర్వాత ఇంటర్‌ ప్రవేశాల ప్రక్రియ ఉంటుందని చెప్పారు. ఈ నెల 31న ఈ సెట్‌, సెప్టెంబర్‌ 2న పాలిసెట్‌ నిర్వహిస్తామని తెలిపారు. అలాగే, సెప్టెంబర్‌ 9, 10, 11, 14న ఎంసెట్‌ నిర్వహించాలని భావిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.
హైకోర్టు అనుమతిస్తే ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఆచార్య పాపిరెడ్డి అన్నారు. ఇప్పటికే ఎంసెట్‌ సహా ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్‌ పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ ప్రకటించినప్పటికీ కరోనా విజృంభణతో అవన్నీ వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ వైరస్‌ వ్యాప్తి ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో, పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో అనే ఆందోళనతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.

హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ గుట్టురట్టు

eamcet2020,for inter,students,digital,classes,for students ,తెలంగాణ,లో డిజిటల్ తరగతులు,, ఎంసెట్, నిర్వహణకు సన్నాహాలు,

హైదరాబాద్ పోలీసులు మరో హైటెక్ సెక్స్ రాకెట్‌ గుట్టును రట్టు చేశారు. గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో సుల్తాన్ బజార్‌లో భారీ సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఓ లాడ్జినే దాని యాజమాన్యం వ్యభిచార కూపంగా మార్చేసింది. లాడ్జిలోకి సెక్స్ వర్కర్లను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచార దందా నడుపుతున్నారు.పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పారిధిలోని ఓ లాడ్జిలో యాజమాన్యమే గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార దందా సాగిస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం రావడంతో ఒక్కసారిగా లాడ్జిపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యభిచార దందా సాగిస్తున్న లాడ్జి యాజమానితో పాటు సెక్స్ వర్కర్లు, విటులను రెడ్ హ్యాండెట్‌గా పట్టుకున్నారు.వారందరినీ సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా ఆ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యభిచార దందా సాగుతున్నట్లు తెలుస్తోంది.

Tags :

Advertisement