Advertisement

కలెక్టరేట్ ఎన్ఐసీలో ఈ-ఆఫీస్ విధాన౦

By: chandrasekar Sat, 12 Sept 2020 12:43 PM

కలెక్టరేట్ ఎన్ఐసీలో ఈ-ఆఫీస్ విధాన౦


శుక్రవారం జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ కార్యాలయ ఈ-ఆఫీస్ విధానాన్ని కలెక్టరేట్ ఎన్ఐసీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ యస్.వెంకట్ రావు మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ శాఖలో మహబూబ్ నగర్ జిల్లాలోనే మొట్టమొదటగా ఈ ఆఫీస్ విధానాన్ని అమలు చేశామన్నారు. ఈ విధానం ద్వారా పారదర్శకత, గోప్యత, పేపర్ వాడకం లేకుండా ఫైలు నిర్వహించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ- ఆఫీస్ విధానం వల్ల పారదర్శకతతో పాటు, ఫైల్ క్లియరింగ్ త్వరగా అవుతుందని తెలిపారు.

పాత తేదీలతో ఫైలు పంపించేందుకు అవకాశం లేదని, అంతేగాక ఫైలు మిస్ కావటానికి అవకాశం ఉండదన్నారు. ఏ ఫైల్ ఎక్కడ ఉందో వెంటనే తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని వివరించారు. ముఖ్యంగా ఫైల్ గోప్యతకు భంగం కలగకుండా ఉంటుందని తెలిపారు. అంతేకాక ఈ -ఆఫీస్ విధానం వల్ల వేల ఫైళ్లు కంప్యూటర్ లో సేవ్ చేసుకోవచ్చన్నారు. జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయం ఈఈ గురుభాగ్యం, రాములు, కార్యాలయ సిబ్బంది, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :
|

Advertisement