కలెక్టరేట్ ఎన్ఐసీలో ఈ-ఆఫీస్ విధాన౦
By: chandrasekar Sat, 12 Sept 2020 12:43 PM
శుక్రవారం జిల్లా
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ కార్యాలయ ఈ-ఆఫీస్ విధానాన్ని
కలెక్టరేట్ ఎన్ఐసీలో ప్రారంభించారు. ఈ
సందర్భంగా జిల్లా కలెక్టర్ యస్.వెంకట్ రావు మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ శాఖలో మహబూబ్
నగర్ జిల్లాలోనే మొట్టమొదటగా ఈ ఆఫీస్ విధానాన్ని అమలు చేశామన్నారు. ఈ విధానం
ద్వారా పారదర్శకత, గోప్యత, పేపర్ వాడకం లేకుండా ఫైలు నిర్వహించేందుకు
ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ- ఆఫీస్ విధానం
వల్ల పారదర్శకతతో పాటు, ఫైల్ క్లియరింగ్
త్వరగా అవుతుందని తెలిపారు.
పాత తేదీలతో ఫైలు
పంపించేందుకు అవకాశం లేదని, అంతేగాక ఫైలు మిస్ కావటానికి అవకాశం ఉండదన్నారు. ఏ
ఫైల్ ఎక్కడ ఉందో వెంటనే తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని వివరించారు. ముఖ్యంగా
ఫైల్ గోప్యతకు భంగం కలగకుండా ఉంటుందని తెలిపారు. అంతేకాక ఈ -ఆఫీస్ విధానం వల్ల వేల
ఫైళ్లు కంప్యూటర్ లో సేవ్ చేసుకోవచ్చన్నారు. జిల్లా ఎగ్జిక్యూటివ్
ఇంజినీర్ కార్యాలయం ఈఈ గురుభాగ్యం, రాములు, కార్యాలయ సిబ్బంది, తదితరులు
కార్యక్రమంలో పాల్గొన్నారు.