టి ట్వంటీల్లో 500 వికెట్లు తీసినందుకు బ్రేవోకు సర్ప్రైజ్ ఇచ్చిన చెన్నయ్ సూపర్ కింగ్స్
By: Sankar Sun, 13 Sept 2020 2:20 PM
చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కే) ఆటగాడు డ్వేన్ బ్రావోకు సర్ప్రైజ్ ఇచ్చింది జట్టు యాజమాన్యం. ఇన్ని రోజులు కరేబియన్ లీగ్ లో ఆడిన బ్రావో తాజాగా ఐపీఎల్ 2020 కోసం యూఏఈ చేరుకున్నాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.
అందులో తనకు కేటాయించిన గదిలోని డైనింగ్ టేబుల్పై పలు రకాల పండ్లతో పాటు '500 వికెట్ల వీరుడికి దుబాయ్ కి సుస్వాగతం' అని తన జట్టు యాజమాన్యం పేర్కొంది. అలాగే పలు రకాల కరోనా కిట్లు కూడా అందించింది. అయితే టీ 20లో 500 వికెట్లు తీసిన తొలి క్రికెటర్గా బ్రావో నిలిచాడు. తన సొంతగడ్డ పై కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రిన్బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నప్పుడు బ్రావో ఈ ఘనతను సాధించాడు.
ఇప్పటివరకు టీ 20 క్రికెట్ చరిత్రలో మరే ఇతర బౌలర్ 400 వికెట్ల మార్కును కూడా దాటలేదు. అయితే బ్రావో కేవలం 459 మ్యాచ్లో ఈ మైలురాయిని సాధించాడు. ఇక కరీనా కారణంగా యూఏఈ లో ఈ నెల 19 నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్ తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ తో తలపడనుంది.