కరోనా చికిత్స పొందుతున్న బల్లి దుర్గాప్రసాద్కు తీవ్ర గుండెపోటుతో మృతి
By: chandrasekar Thu, 17 Sept 2020 12:14 PM
తిరుపతి ఎంపీ, వైసిపి
నేత బల్లి దుర్గాప్రసాద్ రావు (64)
కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆయన
చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కరోనా
చికిత్స పొందుతున్న బల్లి దుర్గాప్రసాద్కు తీవ్ర గుండెపోటు వచ్చిందని, ఈ
కారణంగానే ఆయనను రక్షించుకోలేకపోయామని ఆసుపత్రివర్గాలు పేర్కొన్నాయి. 2019 లోక్
సభ ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన బల్లి
దుర్గాప్రసాద్ రావు గతంలో నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు
ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
1985లో నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన బల్లి
దుర్గాప్రసాద్ రాజకీయాల్లో చేరి 28 ఏళ్ల వయస్సులోనే తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అక్కడి నుంచి ఆయన అంచలంచలుగా ఎదుగుతూ 1994లో చంద్రబాబు హయాంలో మంత్రిగానూ రాష్ట్రానికి సేవలు
అందించారు. మాజీ మంత్రి, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు మృతిపట్ల ఏపీ
సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బల్లి దుర్గాప్రసాద్ కుమారుడికి
ఫోన్ చేసి పరామర్శించిన జగన్ వారి
కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.