Advertisement

  • స్పీకర్ వైపు చంద్రబాబు వేలెత్తి చూపించడంపై సభలో దుమారం...

స్పీకర్ వైపు చంద్రబాబు వేలెత్తి చూపించడంపై సభలో దుమారం...

By: chandrasekar Tue, 01 Dec 2020 8:17 PM

స్పీకర్ వైపు చంద్రబాబు వేలెత్తి చూపించడంపై సభలో దుమారం...


ఏపీ అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. టిడ్కో ఇళ్లపై చర్చ సందర్భంగా వీరి గొడవ తారా స్థాయికి చేరింది. స్పీకర్ తమ్మినేని సీతారం వైపు చంద్రబాబు నాయుడు వేలెత్తి చూపించడంపై దుమారం రేగుతోంది.

మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ని చంద్రబాబు కోరారు. ఐతే ఎందుకు అవకాశం ఇవ్వరని వేలెత్తి చూపించడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. మీ బెదిరింపులకు భయపడేది లేదని చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

''ఏం వేలెత్తి వార్నింగ్ ఇస్తావా? నీ పిల్లి శాపనార్థాలకు భయపడను. పోడియంలోకి వచ్చి బెదిరిస్తావా? ఏమనుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు?'' అంటూ.. తన చేతిలో ఉన్న పేపర్లను విసిరేరు స్పీకర్.

చంద్రబాబు, అచ్చెన్నాయుడు కూడా సీటులో నుంచి లేచి నిలబడి స్పీకర్‌పై విమర్శలు చేసారు. వారు కూడా కాగితాలు విసిరేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని విమర్శించారు.

Tags :

Advertisement