ప్రజల ప్రేమ, ఆదరణ వల్లే సినీరంగంలో కోరుకున్న స్థానానికి చేరుకున్నా...
By: chandrasekar Mon, 30 Nov 2020 1:47 PM
తెలుగు చిత్రసీమలో పంజాబీ
సోయగం రకుల్ప్రీత్సింగ్ ఏడేళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా తన
వెన్నంటి నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులకు మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియ
చేసింది. ఢిల్లీ అమ్మాయినైన తాను ఈ ప్రయాణంలో పక్కా తెలుగమ్మాయిగా మారిపోయానని
ఆనందం వ్యక్తం చేసింది. ‘టాలీవుడ్లో నా కెరీర్ అత్యద్భుతంగా ఉంది. ఇక్కడి ప్రజల
ప్రేమ, ఆదరణ
వల్లే సినీరంగంలో కోరుకున్న స్థానానికి చేరుకున్నా. నాపై ప్రేమానురాగాలు చూపించిన
అభిమానులతో పాటు చక్కటి సూచనలు, సలహాలతో నాకు మార్గదర్శనం చేసిన స్నేహితులకు
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని ఇన్స్టాగ్రామ్లో రకుల్ప్రీత్సింగ్
పేర్కొంది.
‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్' చిత్రంతో
తెలుగు తెరకు పరిచయమైన ఈ సుందరి పలు విజయవంతమైన చిత్రాల్లో కథానాయికగా ప్రేక్షకుల
మన్ననలు పొందింది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రంలో చేస్తోంది.