ఈ నెల 29 నుంచి గ్రేటర్లో మందు షాపులు బంద్ ..ఎప్పటివరకంటే!
By: Sankar Fri, 27 Nov 2020 12:13 PM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బెల్టు షాపులు వెంటనే మూసివేసేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఆదేశించారు.
ఈ నెల 29న సాయంత్రం 6 గంటల నుంచి డిసెంబర్ ఒకటిన పోలింగ్ ముగిసేవరకు గ్రేటర్ పరిధిలో మద్యం షాపులు మూసేయించాలన్నారు. డిసెంబర్ 4న కౌంటింగ్ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం షాపులు మూసివుంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా పార్థసారథి మాట్లాడారు.
ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి ఇప్పటిదాకా 65,098 ప్రచార బ్యానర్లు, పోస్టర్లు, బోర్డులు, ఫ్లెక్సీలు, జెండాలు తొలగించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) వెల్లడించింది. ఇప్పటివరకు 3,133 మందిపై బైండోవర్ కేసులు పెట్టినట్టు తెలిపింది. 243 నాన్బెయిలబుల్ వారంట్లను అమలుచేయగా, ఇంకా 1,549 వారంట్లు పెండింగ్లో ఉన్నాయని, బుధవారందాకా దాదాపు రూ.1.41 కోట్ల నగదును, రూ.11 లక్షల పైచిలుకు విలువ చేసే మెఫెగ్రోన్ డ్రగ్, విడిగాంజా, మద్యం, ఐఎంఎఫ్ఎల్, మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది.