Advertisement

  • దుబ్బాక విజయం పార్టీ కార్యకర్తలకు అంకితం ..బండి సంజయ్

దుబ్బాక విజయం పార్టీ కార్యకర్తలకు అంకితం ..బండి సంజయ్

By: Sankar Tue, 10 Nov 2020 4:33 PM

దుబ్బాక విజయం పార్టీ కార్యకర్తలకు అంకితం ..బండి సంజయ్


దుబ్బాక ఉపఎన్నికలో కారు జోరుకు కళ్లెం వేస్తూ బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. 1,118 ఓట్ల మెజార్టీతో సంచటన విజయం నమోదు కావడంతో తెలంగాణ బీజేపీ నేతలు సంబురాల్లో మునిగిపోయారు.

రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంతో హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు. బాణాసంచా కాల్చి, డోలు బాజాలు మోగించి కార్యకర్తలు ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు.

దుబ్బాక విజయం అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. దుబ్బాక ఓటర్లు చైతన్యపరులని కొనియాడారు. బీజేపీ విజయ పరంపర కొనసాగుతుందని దీమా వ్యక్తం చేశారు. కాగా, దుబ్బాక సాధించిన విజయాన్ని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త శ్రీనివాస్‌కు అంకితం ఇస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు.

Tags :
|

Advertisement