Advertisement

  • సీఎం కెసిఆర్ 2 నియోజకవర్గాలకు సీఎం లాగ ప్రవర్తిస్తున్నారు ...రఘునందన్ రావు

సీఎం కెసిఆర్ 2 నియోజకవర్గాలకు సీఎం లాగ ప్రవర్తిస్తున్నారు ...రఘునందన్ రావు

By: Sankar Fri, 11 Dec 2020 9:39 PM

సీఎం కెసిఆర్ 2 నియోజకవర్గాలకు సీఎం లాగ ప్రవర్తిస్తున్నారు ...రఘునందన్ రావు


సీఎం కెసిఆర్ సిద్ధిపేట పర్యటన నేపథ్యంలో దుబ్బాక ఎంఎల్ఏ రఘునందన్ రావు సీఎం కెసిఆర్ మీద ఫైర్ అయ్యాడు ..సిద్దిపేటలాగానే దుబ్బాకను కూడా అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దుబ్బాకకు మరో వెయ్యి డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.

‘‘దుబ్బాక ఉపఎన్నికలో ఓటమి తర్వాతైనా మారతారని అనుకున్నాం. కానీ, ఇంకా అదే పద్ధతిలో సీఎం ముందుకు వెళ్తున్నారు. కొడుకు కోసం కొత్త సెక్రటేరియట్, అల్లుడి కోసం మెడికల్ కాలేజీ, మనవడి కోసం గజ్వేల్ డెవలప్‌మెంట్.. ఇవి తప్ప ఇంకేం లేవా?’’ కెసిఆర్ 119 నియోజకవర్గాలకు సీఎంలా కాకుండా కేవలం 2 నియోజకవర్గాలకు మాత్రమే ముఖ్యమంత్రిలా ప్రవర్తిస్తున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు ...

సిద్దిపేటకు త్వరలోనే కొత్త ఎయిర్‌పోర్టు వస్తుందని సీఎం అన్నారని గుర్తు చేశారు. కానీ, దుబ్బాకలో కూలిపోయే స్థితిలో ఉన్న ఒక పాత బస్టాండ్ ఉందని దాని స్థానంలో కొత్త బస్టాండ్‌కు నిధులు మంజూరు చేయాలని కోరారు

Tags :
|
|

Advertisement