Advertisement

  • హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన దుబ్బాక ఎమ్యెల్యే రఘునందన్ ... ఎందుకో తెలుసా !

హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన దుబ్బాక ఎమ్యెల్యే రఘునందన్ ... ఎందుకో తెలుసా !

By: Sankar Thu, 12 Nov 2020 4:35 PM

హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసిన దుబ్బాక ఎమ్యెల్యే రఘునందన్ ... ఎందుకో తెలుసా !


దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించిన మాధవనేని రఘునందన్ రావు హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.

సిద్దిపేట నోట్ల కట్టల లొల్లిపై సిద్దిపేట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలని క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో రూ.18 లక్షలు లభించాయని కట్టు కథ అల్లారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అక్రమంగా నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును కోరారు.

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచార సమయంలో సోదాలు నిర్వహించిన పోలీసులు రఘునందన్ బంధువుల ఇళ్లలో నోట్ల కట్టలు దొరికిన విషయంలో.. బీజేపీ చేసిన పనేనంటూ టీఆర్ఎస్.. కాదు కాదు అంతా టీఆర్ఎస్సే చేసిందంటూ బీజేపీ ఇలా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే.

Tags :
|
|

Advertisement