Advertisement

  • నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాను ..దుబ్బాక తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత

నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాను ..దుబ్బాక తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత

By: Sankar Thu, 22 Oct 2020 8:45 PM

నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాను ..దుబ్బాక తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత


దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి అనునిత్యం పాటుపడిన సోలిపేట రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగిస్తానని దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత అన్నారు.

గురువారం చేగుంట మండలం వల్లభపూర్, తాండ, నర్సంపల్లి, చిట్టోజిపల్లి, పొలంపల్లి, పోతన్ శెట్టి పల్లి గ్రామాల్లో మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి, మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డితో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో మీ ముందుకు వచ్చాను.

దుబ్బాకను రామలింగారెడ్డి అభివృద్ధి చేశాడు. నాకు మరింత అభివృద్ధి చేసే అవకాశం కల్పించండని ఓటర్లను వేడుకున్నారు. మంత్రి హరీష్ రావు, ఎంపీ ప్రభాకరన్నల సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండని విజ్ఞప్తి చేశారు.

మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నదని విమర్శించారు. దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో పథకాలు అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్‌ అన్నారు. కాగా, గ్రామస్తులు బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు.

Tags :

Advertisement