పావురం గూడు కట్టుకుంది అని రెండు కోట్ల రూపాయల కారును వాడకుండా ఉంచిన దుబాయ్ ప్రిన్స్
By: Sankar Fri, 14 Aug 2020 1:35 PM
పావురాలకు మన ఇంటి ఆవరణలో గూడు కట్టుకుంటేనే మనం వాటిని తరిమేస్తాము .అందుకే ఒకప్పుడు ఉన్న అన్ని పావురాలు గాని , పిచుకలు గాని ఇప్పుడు లేవు..అయితే పావురం గూడు కట్టుకుంది అని తెలిసి ఆ గూడు ను తెసేయాలేక ఏకంగా రెండు కోట్లు విలువ చేసే కారును వాడకుండా ఆ పావురం కోసం ఆలా వదిలేసాడు..ఇంతకీ ఎవరు ఆయన , ఎక్కడ అని తెలుసుకోవాలని ఉందా ..
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్కు చెందిన మెర్సిడెస్ బెంజ్ ఎస్యూవీ విండ్షీల్డ్పై ఒక పావురం జంట గూడు చేసుకొని, గుడ్లు కూడా పొదగడం ప్రారంభించింది. ఈ విషయాన్ని గమనించిన ప్రిన్స్ ఆ గూడుకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ముందుగా కారును వాడకూడదని నిర్ణయించుకున్నారు. అలాగే కారు చుట్టూ రక్షణ వలయాన్ని కూడా ఏర్పాటు చేయడం విశేషం. అంతేకాదు దీనికి సంబంధించిన టైమ్ ల్యాప్ వీడియోను ఆయన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. కొన్నిసార్లు జీవితంలో చాలా చిన్న విషయాలు సరిపోతాయంటూ కమెంట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. పోస్ట్ చేసిన 24 గంటల వ్యవధిలోనే 10లక్షలకు పైగా వ్యూస్ను సాధించింది.