Advertisement

హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం

By: chandrasekar Mon, 17 Aug 2020 10:21 PM

హైదరాబాద్ లో  డ్రగ్స్ కలకలం


తెలంగాణ రాజధానిలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. భారీ స్థాయిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న డ్రగ్స్ రాకెట్ గుట్టును డిఆర్ఐ అధికారులు గుట్టు రట్టు చేశారు. 250 కిలోల మత్తుమందు ఏపిడ్రున్, కేటమైన్, మేపిడ్రీన్ ను స్వాధీనం చేసుకున్నారు. ముంబై, హైదరాబాద్ లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన అధికారులు డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు.

హైదరాబాద్ నుండి ముంబైకి కార్గో బస్సులో మత్తుమందును రవాణా చేస్తుండగా డిఆర్ఐ అధికారులు గుర్తించి బస్సును ఛేజ్ చేసి పట్టుకున్నారు. హైదరాబాద్ లోని ఓ ఫార్మా కంపెనీలో మత్తు మందు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. రూ.100 కోట్ల విలువ చేసే మొత్తాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.50 కోట్ల విలువ చేసే మత్తమందు రా మెటిరియల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా మత్తుమందును సరఫరా చేసేందుకు డ్రగ్స్ మాఫియా ప్లాన్ వేసినట్లు అధికారులు తెలిపారు.

Tags :
|
|

Advertisement