కన్నడ సీమలో డ్రగ్స్ కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం
By: chandrasekar Tue, 22 Sept 2020 02:28 AM
కన్నడ సీమను
కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో ఇప్పటికే
హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ సహా పలువురిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది.
రాగిణి, సంజనా
విచారణలో అనేక మంది ప్రముఖుల పేర్లు బయటపెట్టడంతో ఇంకా డ్రగ్స్ కేసులో
ఎవరెరున్నారన్నది సస్పెన్స్గా మారింది. అయితే ఈ కేసు నుంచి ప్రముఖులను తప్పించే
ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ప్రముఖ
కొరియాగ్రాఫర్, ఏబీసీడీ సినిమాలో డ్యాన్సర్గా నటించిన కిషోర్ అమన్
శెట్టితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి కొద్ది మోతాదులో
డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు.
ముంబయి నుంచి తెచ్చిన
డ్రగ్స్ను సరఫరా చేసేందుకు మంగుళూరులో బైక్పై వెళ్తున్న వీరిని పోలీసులు
వెంబడించి పట్టుకున్నారు. ఇటీవలే డ్రగ్స్ కేసులో ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేసిన
పోలీసులు రూ.10లక్షల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం
చేసుకున్నారు.