ప్రాణాల మీదకు తెచ్చుకున్న మందు పందెం
By: chandrasekar Sat, 24 Oct 2020 09:40 AM
మందు పందెం కట్టి చివరకు
ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన ఒకటి వెలుగుచూసింది. కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.
బాన్సువాడలో మందు పందెం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నీళ్లు కలపకుండా మద్యం
తాగాలని ఇద్దరు మిత్రులు పందెం పెట్టుకున్నారు. దీంతో మిత్రుడి పందాన్ని
స్వీకరించి నీళ్లు కలపకుండా మద్యం తాగి సోమేశ్వరం సాయిలు (40) మృతి
చెందాడు.
తన భర్త మృతి చెందడంతో
ఆగ్రహించిన మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు
పేర్కొన్నారు. ఈ సంఘటనపై విచారణ చేపడతామని పోలీసులు చెప్పారు. స్నేహితుడి మాట విని
మందు పందానికి పోయి ప్రాణాన్ని పొగొట్టుకున్నాడు.
ఈ సంఘటనతో మృతుడి
భార్యతోపాటు ఇరు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మందు పందెంతో ఓ వ్యక్తి
చనిపోవడంతో బాన్సువాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనవసరంగా పనికిమాలిన పందాలు
కట్టి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుని మృతి చెందిన ఈ సంఘటన గురుంచి చుట్టూ ప్రాంత
ప్రజలు విషాదాన్ని వెలిబుచ్చారు.