Advertisement

  • డా. కుమార్‌స్వామి తంగ‌రాజ్ సీడీఎఫ్‌డీ డైర‌క్ట‌ర్‌గా నియామ‌కం

డా. కుమార్‌స్వామి తంగ‌రాజ్ సీడీఎఫ్‌డీ డైర‌క్ట‌ర్‌గా నియామ‌కం

By: chandrasekar Wed, 12 Aug 2020 4:55 PM

డా. కుమార్‌స్వామి తంగ‌రాజ్ సీడీఎఫ్‌డీ డైర‌క్ట‌ర్‌గా  నియామ‌కం


సీనియ‌ర్ సైంటిస్ట్ డాక్ట‌ర్‌. కుమార్‌స్వామి తంగ‌రాజ్ సీడీఎఫ్‌డీ డైర‌క్ట‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. పాపులేష‌న్ అండ్ మెడిక‌ల్ జెనిటిక్స్‌లో డాక్ట‌ర్ తంగ‌రాజ‌న్ విశేష కృషి చేశారు.

సెంట‌ర్ ఫ‌ర్ సెల్యూలార్ అండ్ మాలుక్యూర్ బ‌యాల‌జీ లో సీనియ‌ర్ సైంటిస్ట్‌గా ప‌నిచేశారు. ప్రస్తుత భారతీయ జనాభా రెండు విభిన్న సమూహాల నుండి వచ్చిందన్నారు.

అదేవిధంగా అండమాన్ నికోబార్ ద్వీపాల గిరిజన జనాభా 65 వేల‌ సంవత్సరాల క్రితం దక్షిణ తీర మార్గం ద్వారా ఆఫ్రికా నుండి వలస వచ్చిన మొదటి ఆధునిక మానవులు అని డాక్టర్ తంగరాజ్ జన్యు అధ్యయనాల ద్వారా తేలింది.

సీడీఎఫ్‌డీని మ‌రింత ఉన్న‌త శిఖ‌రాల‌కు తీసుకెళ్లేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నం చేయ‌నున్న‌ట్లు తంగ‌రాజ్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు.

ఇండియ‌న్ సైంటిఫిక్ అకాడ‌మీతో పాటు జేసీ బోస్ ఫెలోషిప్‌, స‌న్ ఫార్మా రీసెర్చ్ అవార్డు, విశిష్ట శాస్ర్త‌వేత్త అవార్డు, జీవిత‌కాల సాఫ‌ల్య పుర‌స్క‌రాలు వంటి ఎన్నో అవార్డులను ఆయ‌నకు దక్కాయి.

Tags :

Advertisement