Advertisement

  • ఐపీల్ 2020 లో పాల్గొనే క్రికెటర్లకు డోపింగ్ పరీక్షలు

ఐపీల్ 2020 లో పాల్గొనే క్రికెటర్లకు డోపింగ్ పరీక్షలు

By: chandrasekar Wed, 26 Aug 2020 09:04 AM

ఐపీల్ 2020 లో పాల్గొనే క్రికెటర్లకు డోపింగ్ పరీక్షలు


కరోనా వల్ల వాయిదా పడ్డ ఐపీల్ 2020 ఈ సంవత్సరం యూఏఈ లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ - 13వ సీజన్‌లో పాల్గొనే క్రికెటర్లకు డోపింగ్‌ పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) సిద్ధమైంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కి చెందిన జాతీయ డోపింగ్‌ నిరోధక కమిటీ (నాడో) తో కలిసి క్రికెటర్ల శాంపుల్స్‌ సేకరిస్తామని నాడా ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వచ్చేనెల అందరూ ఆటగాళ్లు యూఏఈ కు బయలు దేరనున్నారు.

వేరే దేశాలనుండి కూడా ప్లేయర్ లు యూఏఈ కి చేరుకోనున్నారు. యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మ్యాచ్‌ వేదికల్లో ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించనున్నట్లు నాడా డైరెక్టర్‌ జనరల్‌ నవీన్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. యూఏఈలో నాడా ఐదు డోపింగ్‌ కంట్రోల్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. దుబాయ్‌, అబుదాబి, షార్జాలో ఒక్కో సెంటర్‌ను ఏర్పాటు చేయనుండా శిక్షణా వేదికలు దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ, అబుదాబిలోని జాయేద్‌ క్రికెట్‌ స్టేడియంలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ టెస్టుల్లో ఎవరైనా నిషేధితాలను వాడినట్లు రుజువైతే వారిని శిక్షించడంతో బాటు మ్యాచుల నుండి వెలివేయబడుతారు.

ఐపీల్ మ్యాచ్ లో పాల్గొనే ఆటగాళ్ల మూత్రం శాంపిల్స్‌తో పాటు రక్త నమూనాలను కూడా సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు. ప్రముఖ భారత క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ సహా స్టార్ క్రికెటర్లు 50 మంది నుంచి శాంపిళ్లను సేకరించనున్నారు. మూడు బృందాలు వేర్వేరు బ్యాచ్‌ల్లో యూఏఈకి వెళ్లనున్నాయి. ఫస్ట్‌ బ్యాచ్‌ సెప్టెంబర్‌ మొదటి వారంలో బయలుదేరుతుంది. ఆ తర్వాత మిగతా బృందాలు వెళ్ళనున్నాయి. యూఏఈ వెళ్లడానికి ముందే అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా చేయనున్నారు. మళ్ళీ వీళ్లకు యూఏఈ లో కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.

Tags :
|
|

Advertisement