Advertisement

  • చైనాను ఉద్దేశపూర్వకంగా తప్పుడు అంచనా వేయకండి: చైనా విదేశాంగ శాఖ

చైనాను ఉద్దేశపూర్వకంగా తప్పుడు అంచనా వేయకండి: చైనా విదేశాంగ శాఖ

By: chandrasekar Sat, 04 July 2020 11:02 AM

చైనాను ఉద్దేశపూర్వకంగా తప్పుడు అంచనా వేయకండి: చైనా విదేశాంగ శాఖ


ప్రధాని నరేంద్ర మోదీ లఢఖ్‌లో ఆకస్మికంగా పర్యటించిన కొన్ని గంటల్లోనే చైనా ఈ ప్రకటన విడుదల చేయడం ముఖ్యవిషయం. భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నివారిస్తే బాగుంటుందని చైనా అభిప్రాయపడింది. చైనాను ఉద్దేశపూర్వకంగా తప్పుడు అంచనా వేసే అలవాటును భారత్ మానుకోవాలని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.

భారత్ - చైనా మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ఇరుదేశాల మధ్య మిలిటరీ, దౌత్యపరమైన మార్గాల ద్వారా చర్చలు జరుగుతున్న తరుణంలో సరిహద్దుల్లో మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా ఏ ఒక్కరూ వ్యవహరించకూడదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ పేర్కొన్నారు.

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ నిత్యం ఇచ్చే అధికారిక ప్రకటనల్లో భాగంగానే శుక్రవారం చైనా ఈ ప్రకటన విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ లఢఖ్ పర్యటనలో ఆయన వెంట భారత రక్షణ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నవరానె ఉన్నారు.

అక్కడ ప్రధాని మోదీ ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ బలగాలకు చెందిన ఉన్నతాధికారులు, సైనికులను కలిసి మాట్లాడారు. భారత్-చైనా ఘర్షణ విషయంలో భారత్ సైనికులు చూపిన ధైర్య, సాహసాలు యావత్ ప్రపంచానికి స్పూర్తినిచ్చాయని అన్నారు. యావత్ దేశం సైనికుల వెంటే ఉందని ప్రధాని మోదీ వారికి ధైర్యం చెప్పారు.

లఢఖ్‌లో ప్రధాని మోదీ చేపట్టిన పర్యటనను చైనా అంతర్గతవర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి ప్రధాని మోదీ పర్యటన ఇటు భారత్, అటు చైనాకే కాకుండా ప్రపంచానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తోంది అనే అంశంపైనా చైనా పరిశీలిస్తున్నది.

Tags :
|

Advertisement