రక్తదానం చేయండి ..కిలో చికెన్ తీసుకెళ్లండి
By: Sankar Tue, 08 Dec 2020 3:21 PM
రక్తదానం ...అత్యవసరం సమయంలో మనం చేసే రక్తదానం వలన ఎన్నో ప్రాణాలు నిలబడతాయి ..కానీ చాల మంది స్వచందంగా రక్తదానం చేసేందుకు ముందు రారు అందుకే రక్తదానం మీద అవగాహనా కలిపించేందుకు ముంబై కార్పొరేషన్ ఒక విన్నూత్న పథకాన్ని అమలులోకి తెచ్చింది..
అదేమిటంటే ఈనెల 13 వ తేదీన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంస్థ రక్తదానం చేసేవారికి కిలో చికెన్ లేదా పన్నీర్ ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. దీంతో రక్తాన్ని దానం చేసేందుకు అనేకమంది పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. దాదాపుగా 300 మంది ఆరోజున రక్తదానం చేసినట్టు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంస్థ ప్రకటించింది.
పాలు, మాంసం ఉత్పత్తుల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి రక్తదానం చేసిన వారికి వీటిని అందించినట్టు బిఎంసి తెలియజేసింది.
Tags :
donate |
blood |
paneer |