- హోమ్›
- వార్తలు›
- 244వ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు
244వ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు
By: chandrasekar Mon, 06 July 2020 2:30 PM
అమెరికా 244వ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆ
దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘భారత్ను అమెరికా
ఎప్పటికీ ప్రేమిస్తుంటుంది’ అంటూ ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని గుర్తుచేశారు.
అమెరికాకు బ్రిటన్ నుంచి 1776 జులై 4న స్వాతంత్రం లభించింది. అమెరికన్ల సుదీర్ఘ
పోరాటానికి తలవంచిన ఇంగ్లాండ్ ఆ దేశం నుంచి వైదొలగింది.
అమెరికన్లు
స్వేచ్ఛావాయువులు పీల్చుకుని 244 ఏళ్లు అయిన సందర్భంగా ట్రంప్తో పాటు ఆ దేశ ప్రజలకు
మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అధ్యక్షుడు ట్రంప్తో పాటు అమెరికా ప్రజలకు 244వ
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మీరు అందిపుచ్చుకున్న స్వేచ్ఛ, స్వాతంత్రాలను
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా మేం ఎప్పుడూ ఆదరిస్తాం’ అని మోదీ
ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ట్రంప్ తాజాగా మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ
భారత్పై ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నారు. ట్విట్టర్ వేదికగా రెండు ప్రజాస్వామ్య
దేశాధినేతలు ఒకొరినొకరు గౌరవించుకుంటూ చేసిన ట్వీట్లను ఇరు దేశాల ప్రజలు
స్వాగతించారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మోదీ, ట్రంప్
ట్వీట్లపై ట్రంప్ విక్టరీ భారత్-అమెరికా ఫైనాన్స్ కమిటీ ఉపాధ్యక్షుడు అల్ మాసన్
స్పందించారు.
‘ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల
అధినేతలు ట్రంప్, ప్రధాని మోదీ.. అమెరికా, భారత్
మధ్య నమ్మకమైన బంధం, ప్రేమను ప్రపంచం చూస్తోంది’ అని అన్నారు. ‘ప్రధాని
నరేంద్ర మోదీ.. భారతదేశం మా విలువైన మిత్రునిగా ఉండటానికి అమెరికా
ఆశీర్వదిస్తుంది. అమెరికా, భారత్ ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య
దేశాలు.. మీరు భారత్కు నాయకత్వం వహిస్తున్నప్పుడు మీకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది’
అని ఆఫ్రికా-అమెరికా సింగర్ మ్యారీ మిల్బెన్ ట్వీట్ చేశారు.అమెరికా 244వ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆ
దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘భారత్ను అమెరికా
ఎప్పటికీ ప్రేమిస్తుంటుంది’ అంటూ ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని గుర్తుచేశారు.
అమెరికాకు బ్రిటన్ నుంచి 1776 జులై 4న స్వాతంత్రం లభించింది. అమెరికన్ల సుదీర్ఘ
పోరాటానికి తలవంచిన ఇంగ్లాండ్ ఆ దేశం నుంచి వైదొలగింది.