బఫూన్ లాంటి డొనాల్డ్ ట్రంప్, కేసీఆర్ ఒకేలాంటి వారు...
By: chandrasekar Tue, 24 Nov 2020 5:51 PM
అధికార పార్టీపై
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విమర్శలు ఎక్కువవుతున్నాయి. తాజాగా మాజీ ఎంపీ కొండా
విశ్వేశ్వర్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్, కేటీఆర్పై సోషల్ మీడియా వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు.
డాక్టర్లకు జీతాలు
చెల్లించకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం డబ్బును ఖర్చ చేస్తున్న కేసీఆర్, కేటీఆర్
చీటర్స్ అంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఓవైపు కరోనావైరస్ మళ్లీ
పెరుగుతున్న వేళ డాక్టర్ పారాసెట్మాల్, ఆయన కొడుకు అసలు పట్టించుకోవడం లేదన్నారు. కరోనా
వైరస్ విస్తరిస్తున్న వేళ మాస్కులు అవసరం లేదన్న బఫూన్ లాంటి డొనాల్డ్ ట్రంప్, కేసీఆర్
ఒకేలాంటి వారన్నారు కొండా విశ్వేశ్వర రెడ్డి.
మరోవైపు నాలుగు నెలలుగా
జీతాలు లేకుండా డాక్టర్లు బాధపడుతున్నారని వారంతా సమ్మెకు సిద్ధమవుతున్నారని
ఇంగ్లీష న్యూస్ పేపర్లో వచ్చిన వార్తను కొండా తన ట్వీట్కు జత చేశారు. కరోనా వైరస్
కోసం 288 మంది
సీనియర్ డాక్టర్లను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆరు ఆస్పత్రుల కోసం హైర్
చేసుకుంది.
అయితే వారికి నాలుగు
నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఓ ఇంగ్లీష్ దిన పత్రికలో కథనం వచ్చింది. ఈ
డాక్టర్లతో పాటు కింగ్ కోటి డాక్టర్లు, సిబ్బంది అంతా సమ్మెకు సిద్ధమవుతున్నారు. కరోనా వైరస్
సెకండ్ వేవ్ వస్తున్న వేళ డాక్టర్లు సమ్మెకు దిగితే అది ప్రజారోగ్యంపై తీవ్ర
ప్రభావం చూపే అవకాశాలున్నాయి.