బిర్యానీ తయారీ లో అడుగు పెట్టినా డొమినోస్ పిజ్జా
By: chandrasekar Thu, 17 Dec 2020 10:18 PM
ప్రస్తుతం దేశంలో ప్రజలకు
పిజ్జా పై ఆసక్తి తగ్గడంతోమన ఆహార ప్రియుల ప్రముఖ
వంటకం బిర్యానీ పైడొమినోస్ పిజ్జాసంస్థఆసక్తి కనబరుస్తుంది.ఇందుకోసం ఈ అంతర్జాతీయ ఆహార సంస్థ 'ఏక్దమ్' అనే పేరుతో భారత
మార్కెట్లోకి బిర్యాని అందించుటకుసిద్ధమవుతుంది.ప్రస్తుతం మన దేశంలో ప్రముఖంగా ఉండే హైదరాబాద్ నిజాం
బిర్యాని, నవాబ్ బిర్యాని,దమ్ బిర్యాని, బటర్ చికెన్ బిర్యాని వంటి రకరకాలబిర్యానీ లను వినియోగదారులకు తమ సంస్థ ద్వారా
దేశవ్యాప్తంగా అందజేయనున్నట్లు తెలిపింది.
ఈ బిర్యానీ తయారీ కోసం
వేర్వేరు శాఖాహార మరియు మాంసాహార వంట శాలలను వినియోగించనున్నట్లు తెలియజేసింది.వీరు మొదటగా తమ బిర్యానీ లను ఉత్తర భారతదేశంలోని గురుగ్రహం లో రెస్టారెంట్
లోనూ తర్వాతఢిల్లీ తోపాటు వేర్వేరు పట్టణాల్లో
విస్తరించనున్నట్లు తెలిపారు.ఇప్పటికే దేశంలో చాలా
నగరాల్లో డొమినోస్ పిజ్జా రెస్టారెంట్లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.రానున్న రోజుల్లో బిర్యానినీ అన్ని పట్టణాలకు
విస్తరించనున్నట్లు తెలియజేసింది.ఈ ఎగ్ దమ్ బిర్యానీప్రారంభ ధర రూ. 99 నుండిఉండను న్నట్లు తెలిపారు.ఈ బిర్యానీ లతోపాటు కబాబ్ మరియు స్వీట్స్ లను కూడావిక్రయించనున్నట్లు తెలిపారు.