దేశీయ విమాన ప్రయాణాలు మే 25 నుండి ప్రారంభం మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు
By: chandrasekar Sat, 23 May 2020 5:39 PM
కేంద్రం ప్రభుత్వం మే 25 నుండి
దేశీయ విమానాలు తిరిగి ప్రారంభించవచ్చని ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ లాక్
డౌన్ కారణంగా కుదేలైన విమానయాన రంగాన్ని తిరిగి కోలుకునేలా చేసేందుకు కేంద్రం
ప్రభుత్వం నిర్ధిష్ట కార్యాచరణను అమలు చేస్తోంది.
మొత్తం మూడు నెలల పాటు ప్రతి వారం 8428 విమానాలు నడుస్తాయని స్పష్టం చేశారు. మే 25 నుండి
ఆగస్టు 25 వరకూ
ఈ విధానాన్ని పాటించనున్నారు. దేశీయ విమానయాన సంస్థలు ప్రతి వారం ఈ నిర్ధిష్ట
సంఖ్యలో విమానాలను నడుపుతాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఏ)
అన్ని ప్రముఖ భారతీయ విమానయాన సంస్థల ప్రతినిధులతో మే 21న
సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో దేశీయ విమాన ప్రయాణాలకు సంబంధించి ఈ కీలక
నిర్ణయం తీసుకున్నారు. డిజిసిఏ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అన్ని
సామాజిక దూర నియమాలను పాటించారు. అలాగే ప్రతి విమానయాన సంస్థ నుండి ఇద్దరు ప్రతినిధులను
మాత్రమే హాజరు కావడానికి అనుమతించారు.
సమావేశంలో భాగంగా ప్రయాణ
ఛార్జీలపై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. దేశీయ విమానాల కోసం ఏడు బ్యాండ్
లలో టికెట్ల ధర రూ.2,000 నుండి రూ.18,600ల మధ్య నిర్ణయించబడినట్లు సమాచారం. విమానాల వ్యవధి
ప్రకారం ఈ బ్యాండ్లు ఆధారపడి ఉంటాయి. తక్కువ దూరాన్ని 'A' బ్యాండ్
గా, ఎక్కువ
దూరాన్ని 'G' బ్యాండ్ గా వర్గీకరించారు. ప్రతి బ్యాండ్ కు కనీస
మరియు గరిష్ట ఛార్జీలు ఉంటాయి.
విమానయాన సంస్థలు మరియు
ప్రయాణీకుల కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా మార్గదర్శకాలు.
ప్రయాణీకులు అతడు / ఆమె కంటైన్మెంట్ జోన్ లో ఉంటున్నట్లయితే ప్రయాణించకూడదు. కరోనా
వైరస్ పాజిటివ్ వచ్చిన వారు విమాన ప్రయాణాలు చేయకూడదు. ఆరోగ్య సేతు యాప్ లేదా సెల్ఫ్
డిక్లరేషన్ ఫామ్ ద్వారా ప్రయాణీకులు ఆరోగ్య పత్రాన్ని అందించాలి. మాస్క్ లు మరియు
గ్లవ్స్, ఇతర
రక్షణ చర్యలు తప్పనిసరి. ప్రయాణీకులు తప్పనిసరిగా శానిటైజర్ లు వెంట ఉంచుకోవాలి.
ఎయిర్ లైన్స్ ఎలాంటి ఆహారం కల్పించదు కాబట్టి ప్రయాణీకులే తమ ఆహారాన్ని
తీసుకువెళ్లాలి. ప్రయాణానికి రెండు గంటల ముందే ప్యాసింజర్లు విమానాశ్రయానికి
చేరుకోవాలి.