Advertisement

  • కడుపులో కత్తెర వదిలేసి ఆపరేషన్ చేసిన డాక్టర్లు

కడుపులో కత్తెర వదిలేసి ఆపరేషన్ చేసిన డాక్టర్లు

By: Sankar Thu, 15 Oct 2020 8:22 PM

కడుపులో కత్తెర వదిలేసి ఆపరేషన్ చేసిన డాక్టర్లు


వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు మరో తప్పిదం చేశారు. రోగికి శస్త్ర చికిత్స చేసే సమయంలో ఓ కత్తెరను మర్చిపోయి శరీరంలోనే ఉంచేసి కుట్లు వేసేశారు. కొద్ది రోజుల క్రితం కడుపు నొప్పితో వచ్చిన రోగి విషయంలో ఈ తప్పిదం జరిగింది. రోగి కోలుకొని ఇంటికి వెళ్లాక కడుపునొప్పి మరింత తీవ్రం కావడంతో మళ్లీ అతను ఆస్పత్రికి వచ్చాడు.

ఈసారి వైద్యులు ఎక్స్‌రే తీయడంతో అసలు విషయం బయటపడింది.వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ జిల్లా బెల్లంపల్లి శాంతిఖని గ్రామానికి చెందిన రాజాం కొద్దిరోజులుగా అల్సర్‌తో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ అన్ని టెస్టులు చేసిన డాక్టర్లు ఆరు నెలల కింద ఆయనకు ఆపరేషన్ చేశారు.

అయితే, కొద్దిరోజులుగా అతనికి కడుపులో నొప్పి ఎక్కువవుతుండటంతో రెండు రోజుల క్రితం మళ్లీ ఎంజీఎం ఆసుపత్రికి వచ్చారు. బుధవారం ఎక్స్రే తీయగా కడుపులో కత్తెర ఉన్నట్లు తేలింది. దీంతో డాక్టర్లు తలపట్టుకున్నారు. ఈ విషయం బయటకు రాకుండా దాచే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బంది తీరుపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :
|

Advertisement