బిడెన్ సర్కారులో మరొక భారతీయుడికి చోటు...
By: Sankar Sun, 08 Nov 2020 3:54 PM
ఉత్కంఠ భరింతగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలో పోటీలో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించి.. డొనాల్డ్ ట్రంప్కు ఊహించని షాక్ ఇచ్చారు. నాలుగేళ్ల ట్రంప్ పాలనతో విసుగుచెందిన అమెరికన్స్.. బైడెన్కు పట్టంకట్టారు. విమర్శలు, వివాదాలతో కాలంగడిపిన అధ్యక్షుడిని కోలుకోని దెబ్బకొట్టారు.
మొదట నుంచీ విజయంపై అత్యాశ పడ్డ ట్రంప్కు చివరికి నిరాశే ఎదురైంది. ఇక ఈ ఎన్నికల్లో డెమోక్రాట్స్ నుంచి బరిలో నిలిచి అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారీస్ చరిత్ర సృష్టించారు. ఆమెకు ప్రపంచ నలుమూల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఒక మహిళ, ఒక ఆసియన్ అమెరికన్కు ఈ పదవికి దక్కడం ఇదే తొలిసారి కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు బైడెన్ సర్కార్లో మరో భారతీయుడికి చోటు దక్కే అవకాశం ఉందని అమెరికా వర్గాల ద్వారా తెలుస్తోంది. డాక్టర్ వివేక్ మూర్తికి టాస్క్ఫోర్స్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటకకు చెందిన మూర్తిని 2014లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా 19వ సర్జన్ జనరల్గా నియమించారు