Advertisement

  • బీసీసీఐ IPL 2020 సీజన్ ద్వారా ఎన్ని కోట్లు ఆర్జించిందో తెలుసా....?

బీసీసీఐ IPL 2020 సీజన్ ద్వారా ఎన్ని కోట్లు ఆర్జించిందో తెలుసా....?

By: chandrasekar Mon, 23 Nov 2020 6:45 PM

బీసీసీఐ IPL 2020 సీజన్ ద్వారా ఎన్ని కోట్లు ఆర్జించిందో తెలుసా....?


మార్చిలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 ఏప్రిల్‌కు కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. కానీ కరోనా తగ్గకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ కష్టమనే భావన వ్యక్తమైంది. అదే జరిగితే వేల కోట్లు నష్టపోతామని బీసీసీఐ భావించింది. దీంతో వేదికను ఇండియా నుంచి దుబాయ్‌కు మార్చిన బీసీసీఐ ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించి సత్తా చాటుకుంది. ఈ దశాబ్దంలో తొలిసారి పూర్తి స్థాయిలో నిర్వహించిన ఐపీఎల్ 2020 విజయవంతం కావడంతో బీసీసీఐకి కాసుల పంట కురిసింది. రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిప్ వచ్చిన ఈ సీజన్ ద్వారా రూ. 4000 కోట్లు ఆర్జించింది. అంతే కాదు గత సీజన్‌తో పోలిస్తే ఖర్చు 35 శాతం తగ్గిందని కరోనా సమయంలో తాము రూ.4 వేల కోట్లు సంపాదించామని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు. టీవీ వ్యూయర్‌షిప్ 25 శాతం పెరిగిందన్న ఆయన.. ముంబై, చెన్నై మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో వీక్షించారన్నారు.

ఐపీఎల్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేసిన వారు సైతం లీగ్ ముగిశాక వచ్చి ధన్యవాదాలు తెలిపారని అరుణ్ అన్నారు. ఈ సీజన్లో ఐపీఎల్ జరగకపోతే.. క్రికెటర్లు ఏడాది కాలాన్ని కోల్పోయేవారన్నారు. బీసీసీఐ 30 వేల కరోనా టెస్టులు చేసిందని.. ఐపీఎల్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడం కోసం 1500 మంది పని చేశారని ఆయన తెలిపారు. ఐపీఎల్ 2020కి ఆతిథ్యం ఇచ్చినందుకు గానూ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ)కి బీసీసీఐ రూ.100 కోట్లు చెల్లించింది.

Tags :
|
|

Advertisement