జొకోవిచ్ మీద విమర్శలపై స్పందించిన అతడి తల్లితండ్రులు
By: Sankar Thu, 25 June 2020 12:19 PM
టెన్నిస్ ప్రపంచంలో కరోనా సోకడంతో ఒక్కసారిగా టెన్నిస్ అభిమానులందరు తీవ్ర దిగ్బ్రాంతికి గురి అయ్యారు ..అయితే దిగ్గజ ఆటగాడు నోవాక్ జొకోవిచ్ నిర్వహించిన టోర్నీ ద్వారానే ఈ కరోనా వైరస్ సోకడంతో అందరూ అతడి మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు..అయితే జొకోవిచ్ తో పాటు అతడి భార్యకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది..అయితే జొకోవిచ్ మీద విమర్శలు గుప్పించడంపై జొకోవిచ్ తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు
నొవాక్ను అతని తల్లిదండ్రులు వెనకేసుకొచ్చారు. అంతేకాదు.. ఈ వైరస్ వ్యాప్తికి అసలు కారకుడంటూ దిమిత్రోవ్పై నిందలేస్తున్నారు. ‘ఇది ఎందుకు జరిగింది అతను (దిమిత్రోవ్) టోర్నీకి అనారోగ్యంతోనే వచ్చాడు. అతను ఎక్కడ వైర్సను తగిలించుకున్నాడో ఎవరికి తెలుసు అని నొవాక్ తండ్రి జాన్ జొకోవిచ్ అన్నాడు. కరోనా బారిన పడ్డ తమ అబ్బాయి, కోడలు ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారనీ.. కానీ ఈ విమర్శలే వాళ్లను బాధిస్తున్నాయని జొకో తల్లి డయానా వ్యాఖ్యానించింది.
అయితే ఆండ్రియా టోర్నీ నిర్వహించిన జొకోవిచ్ ఎక్కడ కూడా సామజిక దూరం పాటించలేదు ..ప్రేక్షకులు కూడా చాల మంది మ్యాచ్లను తిలకించేందుకు వచ్చారు అందులో చాల మందికి మాస్క్లు కూడా లేవు ..ఇదే కాకుండా ఆటగాళ్లు మ్యాచ్ లు ముగిసిన తర్వాత ప్రేక్షకులతో కరచాలనాలూ , ఫోటోలు దిగారు దీనితో కరోనా ఇంకా ఎంత మందికి సోకిందో అని ఆందోళన చెందుతున్నారు ..అయితే ఈ టోర్నీ నిర్వహించినందుకు జొకోవిచ్ క్షమాపణలు చెప్పాడు ..వైరస్ ను తక్కువ అంచనా వేసిన అని అన్నాడు ..