ఈ నెల 25 నుంచి ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీ...
By: chandrasekar Mon, 14 Dec 2020 10:44 PM
దేశ చరిత్రలోనే
ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. చిత్తూరు
జిల్లా నుంచి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ఈ నెల 25 నుంచి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం 68 వేల 677
ఎకరాలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 30 లక్షల
66 వేల
ఇళ్ల స్థలాల్ని పంపిణీ చేయనున్నారు.
తిరుపతి, శ్రీకాళహస్తి
నియోజకవర్గాల్లో ఎక్కడనే విషయం ఇంకా నిర్ణయించలేదు. కోర్టు స్టేల కారణంగా
కొన్నిచోట్ల నిలిచిపోవడంతో మిగిలిన 27 లక్షల ఇళ్ల స్థలాల్ని పంపిణీ చేయనున్నారు. ఇందులోంచి
25 వేల 359 ఎకరాల
ప్రైవేట్ భూముల్ని 10 వేల 150 కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. మిగిలినవి
అన్ని ప్రభుత్వ ఆస్తులే. ముఖ్యమంత్రి జగన్ చిత్తూరు జిల్లా కార్యక్రమం కూడా ఫిక్స్
అయ్యింది. రాష్ట్రంలో ప్రతిపేదవాడికి సెంటున్నర స్థలం, పట్టణాల్లో
అయితే సెంటు స్థలం చొప్పున పంపిణీ చేయనున్నారు.