Advertisement

తెలంగాణ కొత్త సచివాలయ డిజైన్ పై నేడు చర్చ

By: chandrasekar Wed, 22 July 2020 4:49 PM

తెలంగాణ కొత్త సచివాలయ డిజైన్ పై నేడు చర్చ


తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయం డిజైన్ ప్రదానాంశంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకమైన సమీక్ష నిర్వహించనున్నారు.

తెలంగాణ సచివాలయం కూల్చివేతలో ఎదురైన కోర్టు ఇబ్బందులన్నీ తొలగిపోవడంతో ఆ పనులు కొనసాగుతున్నాయి. ఇక ఇప్పుడు అదే ప్రాంతంలో నిర్మించబోతున్న కొత్త సచివాలయ డిజైన్ ఎలా ఉండనుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే నూతన సచివాలయ డిజైన్ ఒకటి మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపధ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకమైన సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ప్రధానంగా కొత్త సచివాలయ డిజైన్ పై చర్చ జరగనుంది.

పాత సచివాలయం కూల్చివేత పనులు, కొత్త సెక్రటేరియన్ నిర్మాణంపై ఆర్ అండ్ బి అధికార్లతో సమీక్షించనున్నారు. మరోవైపు ఇటీవల వివాదాస్పదమవుతున్న ఉస్మానియా ఆసుపత్రి విషయంలో కూడా కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

Tags :
|
|

Advertisement