నవంబర్ లో ఉమెన్స్ ఐపీఎల్ నిర్వహణపై చర్చ
By: chandrasekar Mon, 03 Aug 2020 10:02 AM
ఇండియాలో గొప్ప విజయం
సాధించిన ఐపీఎల్ను మ్యాచ్లను ఉమెన్స్ కు కూడా నిర్వహించాలని చర్చలు సాగుతున్నాయి.
దీని ద్వారా మహిళా క్రికెట్కు మంచి రోజులు రాబోతున్నాయి. ఈ ఏడాది నుంచే ఉమెన్స్
ఐపీఎల్ను నిర్వహించేందుకు ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా
(బీసీసీఐ) యోచిస్తోంది. ఈ విషయంపై ప్రస్తుతం చర్చిస్తున్నట్లు బోర్డు మెంబర్ ఒకరు
పేర్కొన్నారు. ‘ఉమెన్స్ ఐపీఎల్ లేదా ఉమెన్స్ టీ 20 ఛాలెంజ్
నిర్వహించాలనుకుంటున్నాం. ప్రస్తుతం దీనిపై చర్చిస్తున్నాం.’ అని వెల్లడించారు.
ప్రపంచంలో ఉమెన్స్ టీంను
మేటి జట్టు గా రూపొందించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేసారు. అలాగే, మహిళా
క్రీడాకారులకోసం శిక్షణా శిబిరం కూడా ఉంటుందని, ఆ దిశగానే పనులు నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
దీన్ని పక్కాగా అమలుచేసేందుకు త్వరలో సరైన ప్రణాళిక కూడా రూపొందిస్తామన్నారు.
ఉమెన్స్ టోర్నమెంట్ నవంబర్ 1-10వ తేదీ మధ్య నిర్వహించాలనుకుంటున్నాం. ఇంకా ఇది చర్చల
దశలోనే ఉందన్నారు. ఇంకా ఏదీ ఖరారు కాలేదని, తాము కూర్చుని ప్రతి అంశంపై చర్చిస్తామని స్పష్టం
చేశారు.