Advertisement

ఏపీలో పలు జిల్లాలకు పిడుగు హెచ్చరిక...!

By: Anji Sat, 03 Oct 2020 8:17 PM

ఏపీలో పలు జిల్లాలకు పిడుగు హెచ్చరిక...!

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లాలోని పి. గన్నవరం, అడ్డతీగల, అంబాజీపేట, అమలాపురం, అయినవల్లి, కపిలేశ్వరపురం, కొత్తపేట మండలాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.

అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని కుకునూర్, కడప జిల్లాలో ముద్దునూర్‌లలో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉన్నట్లు వెల్లడించింది. అటు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూడా పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి అన్నారు.

పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చిరించింది. ప్రజలంతా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు.

Tags :

Advertisement