Advertisement

కూరగాయలు అమ్ముకుంటున్న డైరెక్టర్...!

By: Anji Tue, 29 Sept 2020 08:50 AM

కూరగాయలు అమ్ముకుంటున్న డైరెక్టర్...!

కరోనా లాక్ డౌన్ తో వేలాది ఉద్యోగాలు పోయాయి. లక్షలాది మంది వలస కార్మికులు మరియు రోజు వారి లేబర్ తీవ్ర అవస్థలు పడ్డారు. సినీ ప్రముకులు కూడా కోట్లల్లో నష్టపోయిన విషయం తెల్సిందే.

తాజాగా బాలికా వధు సీరియల్ కు ఎపిసోడ్ డైరెక్టర్ గా వ్యవహరించిన రామ్ విక్ష గౌర్ లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నాడు అంటూ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరిని ఆర్థిక సాయం అడగలేక తన తండ్రి కూరగాయల వ్యాపారాన్ని రామ్ విక్ష గౌర్ కూడా చేస్తున్నారట.

ప్రస్తుతం ఈయన యూపీలోని తన సొంత జిల్లా ఆజామ్ ఘడ్ లో కూరగాయలు అమ్ముతున్నాడట. హిందీతో పాటు భోజ్ పూరి సినిమాలు ఇప్పటికే కమిట్ అయిన ఈ దర్శకుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సినిమాలను తీయలేక పోతున్నాడట. ఆ సినిమాల ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న సమయంలో లాక్ డౌన్ విధించడంతో ఆ సినిమాలకు పెట్టుబడి పెడతామంటూ ముందుకు వచ్చిన వారు ఇప్పుడు తమ వల్ల కాదని ఏడాది ఆగాలన్నారట.

దాంతో చేసేది ఏమీ లేక దర్శకుడు కూరగాయల వ్యాపారం మొదలు పెట్టారు అంటూ ప్రచారం జరగుతోంది. ముంబయిలో ఇల్లు ఉన్న తాను త్వరలో మళ్లీ ముంబయి వెళ్లి సినిమా పనులు మొదలు పెట్టుకుంటానంటూ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడట.

Tags :

Advertisement