Advertisement

  • ప్రభాస్ రాధే శ్యామ్ మేకింగ్ వీడియో షేర్ చేసిన డైరెక్టర్ రాధాకృష్ణ

ప్రభాస్ రాధే శ్యామ్ మేకింగ్ వీడియో షేర్ చేసిన డైరెక్టర్ రాధాకృష్ణ

By: Sankar Thu, 19 Nov 2020 11:41 PM

ప్రభాస్ రాధే శ్యామ్ మేకింగ్ వీడియో షేర్ చేసిన డైరెక్టర్ రాధాకృష్ణ


ప్రభాస్‌ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’‌ మేకింగ్‌ వీడియోను దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ గురువారం షేర్‌ చేశారు. అక్టోబర్‌లో ఇటలీ షెడ్యూల్‌ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫీల్మ్‌ సిటీలో చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ గురువారం మేకింగ్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. నీలిరంగు స్ర్కీన్‌లో ఉన్న ఈ వీడియోకు ‘మా చిత్ర బృందంతో నీలి రంగు తెరపై’ అనే క్యాప్షన్‌ను జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ‘బాహుబలి’, ‘సాహో’ వంటి సినిమాలతో పాన్‌ ఇండియా నటుడిగా మారిన ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’పై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్నా వారందరిని ‘రాధేశ్యామ్‌’ మేకింగ్‌ వీడియో తెగ ఆకట్టుకుంటోంది. ఉన్నది కొద్ది సెకండ్లే అయినా బ్లూ స్ర్కీన్‌పై సరికొత్తగా తీసిన ఈ‌ మేకింగ్‌ వీడియోకు నెటిజన్‌లు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ సినిమాపై ‘డార్లింగ్’‌ ప్రభాస్‌ అభిమానుల అంచనాలు మరింత పెరిగాయనిపిస్తోంది.

Tags :
|

Advertisement