రెండు కరోనా పరీక్ష రిపోర్ట్ లో వేర్వేరు ఫలితాలు... బీజేపీ ఎంపీ హనుమాన్
By: chandrasekar Tue, 15 Sept 2020 12:36 PM
రాజస్థాన్కు చెందిన
బీజేపీ ఎంపీ హనుమాన్ బెనివాల్ కరోనా పరీక్ష రిపోర్ట్ ఏది కరెక్టో తనకు తెలియడం
లేదని సందేహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలోని
పార్లమెంట్ ప్రాంగణంలో ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరోనా పరీక్షలో తనకు
పాజిటివ్గా నమోదై౦దని ఆయన తెలిపారు. దీంతో సమావేశాలకు తనను అనుమతించలేదని
చెప్పారు.
కానీ, జైపూర్లోని
ఎస్ఎంఎస్ మెడికల్లో కరోనా పరీక్ష చేయించుకోగా నెగిటివ్గా వచ్చిందని ఎంపీ హనుమాన్
బెనివాల్ అన్నారు. ఈ రెండు రిపోర్టుల్లో ఏ
రిపోర్టు కరెక్టో ఏది తప్పో తనకు అర్థం
కావడం లేదంటూ సోమవారం ట్వీట్ చేశారు. ఆ రెండు రిపోర్టులను అందులో పోస్ట్ చేశారు.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఐసీఎంఆర్ యుద్ధప్రాతిపదికన ఎంపీలు, సిబ్బందితోసహా
2500
మందికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించింది. కాగా తొలి రోజు 25 మంది
ఎంపీలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.