రవీంద్ర జడేజా చెలరేగిన తీరుకు ధోనీ భార్య సాక్షి ధోని రియాక్షన్
By: chandrasekar Fri, 30 Oct 2020 9:44 PM
గురువారం జరిగిన ఐపీఎల్
మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై అద్భుత రీతిలో చెన్నై సూపర్ కింగ్స్
గెలిచింది. చేజింగ్లో ఆఖరి ఓవర్లో రవీంద్ర
జడేజా.. చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి జట్టుకు అనూహ్య విజయాన్ని
అందించాడు.
అత్యంత ఉత్కంఠంగా సాగిన ఆ
మ్యాచ్పై చెన్నై కెప్టెన్ ధోనీ భార్య సాక్షి ధోని రియాక్ట్ అయ్యారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో జడేజాపై ఆమె
కామెంట్ చేసింది. ఇన్నింగ్స్ చివరి రెండు బంతుల్ని సిక్సర్ కొట్టిన జడేజాను
మెచ్చుకుంటూ బాప్ రే బాప్ అన్న కామెంట్ చేసిందామె.
కోల్కతా బౌలర్ నాగకోటి వేసిన బౌలింగ్లో జడేజా చెలరేగిన తీరు అందర్నీ
స్టన్ చేసింది. ఫెర్గూసన్ వేసిన 19వ ఓవర్లోనూ
జడేజా భారీ షాట్లతో అలరించాడు. ఈ మ్యాచ్లో జడ్డూ 11
బంతుల్లో 31 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. నెట్స్లో బాల్ను
బాగా హిట్ చేశానని, ఆ నమ్మకంతోనే చివరి రెండు ఓవర్లలో భారీ షాట్లు
కొట్టినట్లు జడేజా తెలిపాడు. తొలుత కోల్కతా
నిర్ణీత 20 ఓవర్లలో
5
వికెట్లకు 172 రన్స్ చేయగా ఆ లక్ష్యాన్ని చివరి బంతికి చెన్నై
చేధించింది.