ధోనీ జీవితచరిత్రలో టైటిల్ రోల్ చేసిన హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య
By: chandrasekar Mon, 15 June 2020 10:29 AM
ధోనీ జీవితచరిత్రలో
టైటిల్ రోల్ చేసిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు
పాల్పడ్డారు. బాంద్రాలో ఉన్న తన ఇంట్లో ఆయన ఉరివేసుకున్నట్లు ధ్రువీకరించిన ముంబయి
పోలీసులు ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదని, దర్యాప్తు చేస్తున్నామని
తెలిపారు. సూసైడ్ నోట్ వంటిదేమీ దొరకలేదని ముంబయి పోలీసుల అధికార ప్రతినిధి డీసీపీ
ప్రణయ్ అశోక్ చెప్పారు. సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆయన ఇంట్లో పనిచేసేవారు
సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
సుశాంత్ సింగ్ బిహార్లోని
పట్నాలో 1986 జనవరి
21న
జన్మించారు. సినిమాల్లోకి రాకముందు ఎన్నో టీవీ సీరియళ్లలో నటించారు. కిస్ దేశ్ మే
హై మేరా దిల్ అనే టీవీ సీరియల్తో అతని నటనా జీవితం ప్రారంభమైంది. జీటీవీలో 2009-11లో వచ్చిన పవిత్ర రిష్తా సీరియల్తో మంచి పేరు సంపాదించిన ఆయన 2013లో
వచ్చిన కైపోచేతో సుశాంత్ బాలీవుడ్లోకి అడుగుపెట్టారు.
సుశాంత్ సింగ్ బిహార్లోని
పట్నాలో 1986 జనవరి
21న
జన్మించారు. సినిమాల్లోకి రాకముందు ఎన్నో టీవీ సీరియళ్లలో నటించారు. కిస్ దేశ్ మే
హై మేరా దిల్ అనే టీవీ సీరియల్తో అతని నటనా జీవితం ప్రారంభమైంది. జీటీవీలో 2009-11లో వచ్చిన పవిత్ర రిష్తా సీరియల్తో మంచి పేరు సంపాదించిన ఆయన 2013లో
వచ్చిన కైపోచేతో సుశాంత్ బాలీవుడ్లోకి అడుగుపెట్టారు.
భారత క్రికెటర్ మహేంద్ర
సింగ్ జీవితకథతో వచ్చిన ‘ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ’ సినిమాతో దక్షిణాది
ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. కేదార్నాథ్, చిచోరే లాంటి కమర్షియల్ సినిమాలు కూడా చేశాడు.
జర్నలిస్ట్ మధు పాల్ వివరాల ప్రకారం బాంద్రా పోలీస్ స్టేషన్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్
నౌకరు ఈ ఘటన గురించి సమాచారం ఇచ్చారు. టీవీ నటుడుగా కెరియర్ ప్రారంభించిన సుశాంత్
సింగ్ రాజ్పుత్ ఇటీవల కొన్నేళ్లుగా వెండితెరపై తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
సుశాంత్ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ చందామామా దూర్ కే రిలీజ్ కావాల్సి ఉంది.
బడ్జెట్ కొరతతో ఆ చిత్రాన్ని ప్రస్తుతానికి ఆపేశారు.
పది రోజుల క్రితం అతడు
ఇన్స్టాగ్రాంలో తన తల్లి ఫొటోతో పాటూ తన ఫొటోను పోస్ట్ చేశాడు. 'మసకబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది. అనంతమైన
కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి
మధ్యా బతుకుతున్నా' అని సుశాంత్ ఆ పోస్టులో రాశారు. సుశాంత్ ఇంజనీరింగ్
చేశాక హీరో కావాలనే కలలు నిజం చేసుకోడానికి యాక్టింగ్ వైపు మళ్లాడు.మొదట్లో అతడు
డ్యాన్సర్గా పనిచేశాడు. ఆ తర్వాత 'కిస్ దేశ్ మే హై మేరా దిల్' పేరుతో
వచ్చిన సీరియల్తో అతడికి యాక్టింగ్ కెరీర్లో మొదటి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత 'పవిత్ర
రిస్తా' సీరియల్
సుశాంత్ను ఇంటింటికీ పరిచయం చేసింది.
యాక్టింగ్ కెరీర్
విజయవంతం అయ్యాక సుశాంత్ 'జర నచ్ కే దిఖా',
'ఝలక్ దిఖలాజా' డాన్స్ రియాలిటీ షోల్లో కూడా పాల్గొన్నాడు. తొలి
సినిమా 'కైపోచే'లో
అతడికి ప్రశంసలు దక్కడంతో సుశాంత్ కెరియర్ గ్రాఫ్ పైపైకి వెళ్లింది. వరస హిట్స్
అందుకున్నాడు మరియు కెరియర్ పరంగా విజయం దక్కినా సుశాంత్ 'లవ్
లైఫ్' అంత
సంతృప్తికరంగా లేదు. టీవీ సీరియల్ 'పవిత్ర రిష్తా'లో సహ నటి అంకితా లోఖండేతో అతడు సహజీవనం చేశాడు.
తర్వాత ఇద్దరూ విడిపోయారని వార్తలు వచ్చాయి. సుశాంత్ సినీరంగంలో విజయవంతం కావడంతో
ఇద్దరి మధ్యా మనస్ఫర్థలు వచ్చాయని భావించారు.
యాక్టింగ్ కెరీర్
విజయవంతం అయ్యాక సుశాంత్ 'జర నచ్ కే దిఖా',
'ఝలక్ దిఖలాజా' డాన్స్ రియాలిటీ షోల్లో కూడా పాల్గొన్నాడు. తొలి
సినిమా 'కైపోచే'లో
అతడికి ప్రశంసలు దక్కడంతో సుశాంత్ కెరియర్ గ్రాఫ్ పైపైకి వెళ్లింది. వరస హిట్స్
అందుకున్నాడు మరియు కెరియర్ పరంగా విజయం దక్కినా సుశాంత్ 'లవ్
లైఫ్' అంత
సంతృప్తికరంగా లేదు. టీవీ సీరియల్ 'పవిత్ర రిష్తా'లో సహ నటి అంకితా లోఖండేతో అతడు సహజీవనం చేశాడు.
తర్వాత ఇద్దరూ విడిపోయారని వార్తలు వచ్చాయి. సుశాంత్ సినీరంగంలో విజయవంతం కావడంతో
ఇద్దరి మధ్యా మనస్ఫర్థలు వచ్చాయని భావించారు.