Advertisement

  • కన్నీళ్లను దిగమింగుకొని ఆటకు వీడుకోలు పలికారు ..ధోని రిటైర్మెంట్ పై సాక్షి ధోని భావోద్వేగ పోస్ట్

కన్నీళ్లను దిగమింగుకొని ఆటకు వీడుకోలు పలికారు ..ధోని రిటైర్మెంట్ పై సాక్షి ధోని భావోద్వేగ పోస్ట్

By: Sankar Sun, 16 Aug 2020 09:39 AM

కన్నీళ్లను దిగమింగుకొని ఆటకు వీడుకోలు పలికారు ..ధోని రిటైర్మెంట్ పై సాక్షి ధోని భావోద్వేగ పోస్ట్


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. తన అభిమానుల కోసం పంచుకున్న సందేశంలో మీ నుంచి ఎల్లప్పుడూ లభించే ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు అని సోషల్ మీడియాలో ధోనీ రాశారు. శనివారం 7.29(19.20) తర్వాత నన్ను పదవీ విరమణ చేసినట్లు ఆలోచించండి అని తన పోస్ట్ లో పేర్కొన్నారు.

ధోని రిటైర్మెంట్ పై ఎందరో స్పందించారు. కొందరు ఆయనతో కలిసి నడిచిన కాలాన్ని గుర్తుచేసుకోగా... మరికొందరు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ధోనీ ఘనతల్ని గుర్తు చేసుకుంటూ ఫొటోలు, వీడియోల్ని ట్విటర్‌లో షేర్ చేస్తున్నారు. అభిమానులే కాదు.. ధోనీ సహచర క్రికెటర్లు కూడా అతనితో తమకి ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.

మీరు సాధించిన విజయాలను చూసి గర్వపడాలి. రిటైర్మెంట్‌ ప్రకటించినందుకు అభినందనలు. మీరు సాధించిన విజయాలను చూసి నేను గర్విస్తున్నాను. మీకిష్టమైన ఆటకు గుడ్‌బై చెప్పే క్రమంలో మీరు పడిన మనోవేదన నాకు తెలుసు. కన్నీళ్లను దిగమించుకొని రిటైర్మెంట్‌ ప్రకటించారని అనుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పిన మాటలు, చేసిన పనిని ప్రజలు మర్చిపోతారేమో కానీ, వాళ్లకు అందించిన అనుభూతిని ఎప్పుడూ మర్చిపోలేరు’అని సాక్షిసింగ్‌ ధోని పేర్కొన్నారు

Tags :
|
|
|

Advertisement