Advertisement

  • ధోని సలహా వల్లనే ఆ మ్యాచ్ లో గెలిచాము ..హార్దిక్ పాండ్య

ధోని సలహా వల్లనే ఆ మ్యాచ్ లో గెలిచాము ..హార్దిక్ పాండ్య

By: Sankar Thu, 11 June 2020 07:30 AM

ధోని సలహా వల్లనే ఆ మ్యాచ్ లో గెలిచాము ..హార్దిక్ పాండ్య


వికెట్ల వెనుక నుంచి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ కదలికల్ని నిశితంగా పరిశీలించే ధోనీ.. మ్యాచ్ గమనానికి అనుగుణంగా వ్యూహాల్ని రచిస్తుంటాడు. 2016 టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాతో కలిసి తెలివిగా వ్యూహాలని రచించిన ధోనీ.. భారత్‌కి చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. మ్యాచ్ భారత్‌కి చేజారిపోయిందనే దశలో.. చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టిన టీమిండియా పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది.

బంగ్లాదేశ్ విజయానికి చివరి 6 బంతుల్లో 11 పరుగులు అవసరమవగా.. ఆఖరి ఓవర్ కోసం హార్దిక్ పాండ్యా చేతికి ధోనీ బంతినిచ్చాడు. తొలి బంతికి మహ్మదుల్లా సింగిల్ తీయగా.. తర్వాత రెండు బంతుల్నీ ముష్ఫికర్ వరుసగా 4, 4గా బాదేశాడు. దాంతో సమీకరణం 3 బంతుల్లో 2 పరుగులుగా మారిపోయింది. కానీ.. ఆ దశలో విన్నింగ్ షాట్ కోసం వెంపర్లాడిన బంగ్లాదేశ్ మూల్యం చెల్లించుకుంది. వరుసగా 4, 5 బంతుల్లో ముష్ఫికర్, మహ్మదుల్లా క్యాచ్‌లు ఇచ్చేయగా.. ఆఖరి బంతికి సింగిల్ తీసే ప్రయత్నంలో ముస్తాఫిజుర్ రెహ్మన్ రనౌటయ్యాడు. దాంతో చేజారిపోయిందనుకున్న మ్యాచ్‌ని టీమిండియా అనూహ్యంగా ఒడిసి పట్టుకుంది.

dhoni,hardik pandya,india,bangladesh,t 20, ,ధోని , హార్దిక్ పాండ్య , బంగ్లాదేశ్ , భారత్‌,  మహ్మదుల్లా


ఆ మ్యాచ్‌లో భారత్‌ని గెలిపించిన ఘనత చివరి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యాకి దక్కినా.. తెర వెనుక ధోనీ ఉన్నాడని తాజాగా పాండ్యా వెల్లడించాడు. ‘‘నాలుగో బంతి సమయంలో బ్యాట్స్‌మెన్‌గా నేను క్రీజులో ఉండింటే.. ఫస్ట్ సింగిల్ కోసం ట్రై చేసి.. ఆ తర్వాత విన్నింగ్ షాట్ గురించి ఆలోచించేవాడ్ని. ఇక చివరి బంతికి బంగ్లాకి రెండు పరుగులు అవసరమైన దశలో మైదానంలోని సహచరులు బౌన్సర్ సంధించమని సూచించారు. కానీ.. ధోనీ మాత్రం ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా బంతి విసరాలని సూచించాడు. ఒకవేళ బౌన్సర్‌ని బ్యాట్స్‌మెన్ హిట్ చేస్తే..? అది కీపర్ పైనుంచి వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని ధోనీ హెచ్చరించాడు’’ అని హార్దిక్ గుర్తు చేసుకున్నాడు. చివరి బంతిని బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ హిట్ చేయకపోయినా.. సింగిల్ కోసం పరుగెత్తగా.. ధోనీ రనౌట్ చేసిన విషయం తెలిసిందే.

Tags :
|
|
|

Advertisement