Advertisement

  • న్యూలుక్ తో ధోనీ ఫొటో సోషల్‌ మీడియాలో హల్ చల్...

న్యూలుక్ తో ధోనీ ఫొటో సోషల్‌ మీడియాలో హల్ చల్...

By: chandrasekar Mon, 03 Aug 2020 09:28 AM

న్యూలుక్ తో ధోనీ ఫొటో సోషల్‌ మీడియాలో హల్ చల్...


ఐపీల్ 2020 కరోనా వల్ల వాయిదా పడ్డ విషయం తెలిసిందే. బీసీసీఐ ఉత్తర్వులమేరకు ఈ సీసన్ను యూఏఈ లో నిర్వహించడానికి తీసికున్న కారణంగా ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. అతికొద్దిరోజుల్లో ఐపీల్‌ ప్రారంభమవుతున్న వేళ చెన్నై సూపర్‌కింగ్స్ 'సీఎస్‌కే' టీం కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ న్యూలుక్‌తో అదరగొడుతున్నాడు. తల వెంట్రుకలు, నల్లటి గడ్డాన్ని నీట్‌గా ట్రిమ్‌ చేసుకుని మ్యాన్లీగా కనిపిస్తున్న ధోనీ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అభిమానులంతా హెలిక్యాప్టర్‌ షార్ట్స్‌ స్పెషలిస్ట్‌ కొత్త లుక్‌ను చూసి ఫిదా అవుతున్నారు.

గత సంవత్సరం వరల్డ్ కప్ తరువాత జూలై 2019 నుంచి ధోనీ క్రికెట్‌ మ్యాచ్‌లలో పాల్గొనడం లేదు. 14 నెలల విరామం తర్వాత ఐపీఎల్‌లో తిరిగి పాల్గొననున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ శిక్షణా శిబిరాలను యూఏఈలో నిర్వహించనున్నాయి. ఈ నెల రెండోవారంలో సీఎస్‌కే యూఏఈ చేరకుంటుందని జట్టు అధికారులు ధ్రువీకరించారు. అంటే రాబోయే కొద్దిరోజుల్లోనే ధోనీ మైదానంలోకి రాబోతున్నాడు. అతడి ఆట కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags :
|
|

Advertisement